Breaking News

తెలంగాణలో 1.60లక్షలు దాటిన కరోనా కేసులు

తెలంగాణలో 1.60లక్షలు దాటిన కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో మంగళవారం (24గంటల్లో) 2,058 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో మొత్తం కేసులు 1.60లక్షలు దాటాయి. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 984కు చేరింది. రాష్ట్రంలో మొత్తం బాధితుల సంఖ్య 1,60,571 గా నిర్ధారణ అయింది. జీహెచ్​ఎంసీ పరిధిలో అత్యధికంగా 277 కేసులు నమోదయ్యాయి. ఒకేరోజు 51,247 నమూనాలను పరీక్షించారు. రాష్ట్రంలో 2,180 మంది కరోనా వ్యాధి నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా, ఇప్పటివరకు మొత్తం 1,29,187 మంది కోలుకుని డిశ్చార్జ్​అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,400 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. ఆదిలాబాద్​ 20, భద్రాద్రి కొత్తగూడెం 75, జగిత్యాల 52, జనగామ 30, జయశంకర్​ భూపాలపల్లి 28, జోగుళాంబ గద్వాల 29, కామారెడ్డి 43, కరీంనగర్​ 135, ఖమ్మం 103, ఆసిఫాబాద్ ​24, మహబూబ్​నగర్ ​38, మహబూబాబాద్​ 68, మంచిర్యాల 41, మెదక్ ​38, మేడ్చల్​ మల్కాజిగిరి 97, ములుగు 36, నాగర్​కర్నూల్​ 42, నల్లగొండ 96, నిర్మల్ ​42, నిజామాబాద్​ 84, పెద్దపల్లి 48, రాజన్నసిరిసిల్ల 45, రంగారెడ్డి 143, సంగారెడ్డి 24, సిద్దిపేట 106, సూర్యాపేట 62, వికారాబాద్​ 24, వనపర్తి 23, వరంగల్​అర్బన్​ 108, యాదాద్రి భువనగిరి 53 చొప్పున కరోనా నిర్ధారణ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు తెలంగాణ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​ను విడుదల చేసింది.