Breaking News

తెగుళ్లను అరికడదాం

సారథి న్యూస్, రామాయంపేట: పంటలను ఆశించే తెగుళ్లను సకాలంలో అరికడితేనే అధిక దిగుబడి సాధించవచ్చని నిజాంపేట మండల వ్యవసాయాధికారి సతీశ్​ పేర్కొన్నారు. మంగళవారం ఆయన మండలంలోని చల్మేడ గ్రామంలో జాతీయ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా రైతులకు విత్తనోత్పత్తి చేసే రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విత్తనోత్పత్తి లో తీసుకోవాల్సిన మెలకువలు, పంటను ఆశించు తెగుళ్లు, పురుగులు అరికట్టేవిధానంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏఈవో గణేశ్​కుమార్, సర్పంచ్ నరసింహారెడ్డి, రైతులు శ్రీనివాస్ రెడ్డి, బాలయ్య, తిర్మలయ్య పాల్గొన్నారు.