దుబాయ్: స్కోరు తక్కువే అయినా.. ఛేదించలేక సన్రైజర్స్ హైదరాబాద్ చతికిలపడింది. ఐపీఎల్13వ సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగిన 43వ మ్యాచ్లో వార్నర్సేన ఘోరంగా ఓడిపోయింది. కింగ్స్పంజాబ్12 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. టాస్ గెలిచిన హైదరాబాద్ ఫీల్డింగ్ తీసుకోవడంతో మొదట బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 126 పరుగులు చేసింది. టార్గెట్ను ఛేదించే క్రమంలో ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ను డేవిడ్ వార్నర్, బెయిర్ స్టోలు ధాటిగా ఆరంభించారు. ఈ జోడి 56 పరుగుల జత చేసిన తర్వాత వార్నర్(35; 20 బంతుల్లో 4×3 , 6×2) ఔట్ అయ్యాడు. ఆ వెంటనే బెయిర్ స్టో(19; 20 బంతుల్లో 4×4) పెవిలియన్ బాటపట్టాడు. అబ్దుల్ సామద్(7; 5 బంతుల్లో 4×1) ఇలా వచ్చి అలా వెళ్లిపోయాడు. ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ కు క్యూకట్టారు. 19.5 ఓవర్లలో 114 పరుగులకే సన్రైజర్స్ ఎదురీదలేక ఓటమిని మూటగట్టుకుంది. ఆరుగురు సన్రైజర్స్ ఆటగాళ్లు రెండంకెల స్కోరు దాటలేదు.
ముందుగా బ్యాటింగ్కు దిగిన కింగ్స్ పంజాబ్ ఇన్నింగ్స్ను కేఎల్ రాహుల్, మనదీప్ సింగ్ ఆరంభించారు. జట్టు స్కోరు 66 పరుగుల వద్ద ఉండగా గేల్(20;20 బంతుల్లో 4×2, 6×1) ఔటయ్యాడు. రాహుల్(27; 27 బంతుల్లో 4×2, 6×1) ఔటయ్యాడు. ఆ తర్వాత మ్యాక్స్వెల్(12), దీపక్ హుడా(0), క్రిస్ జోర్డాన్(7), మురుగన్ అశ్విన్(4) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. నికోలస్ పూరన్(32 నాటౌట్; 28 బంతుల్లో 4×2) దూకుడు పెంచడంతో పంజాబ్వంద పరుగులను దాటగలిగింది. హైదరాబాద్బౌలర్లలో సందీప్ శర్మ, హోల్డర్, రషీద్ ఖాన్ రెండు వికెట్ల చొప్పున తీశారు.
- October 25, 2020
- Archive
- Top News
- క్రీడలు
- HYDERABAD
- KINGSPANJUB
- RAHUL
- SUNRISERS
- WARNER
- కింగ్స్ పంజాబ్
- రాహుల్
- వార్నర్
- సన్రైజర్స్ హైదరాబాద్
- హైదరాబాద్
- Comments Off on తక్కువ స్కోరే.. ప్చ్!