Breaking News

డ్రగ్స్​కేసులో దీపికా, శ్రద్ధా పేర్లు..

బాలీవుడ్​లో డ్రగ్స్​కేసు రోజుకో మలుపు తిరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా దీపికా పదుకొనే, శ్రద్దా కపూర్​ల పేర్లు వినిపిస్తున్నాయి. వారికి కొందరు ఏజెంట్లు కోడ్​నేమ్​లతో డ్రగ్స్​ను విక్రయించినట్టు ఏన్​సీబీ విచారణలో తేలిందట. త్వరలోనే వారికి ఎన్​సీబీ నోటీసులు జారీచేయనుందట. ఈ మేరకు జాతీయమీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో రకుల్​ ప్రీత్​సింగ్, సారా అలీఖాన్​ పేర్లు వినిపించాయి. అయితే ఈ కేసులో మీడియాలో తనపేరు రాకుండా చూడాలని రకుల్​ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీంతో మీడియా స్వీయ నియంత్రణ పాటించాలని కోర్టు ఆదేశాలు జారిచేసింది. అయినప్పటికీ మరోసారి రకుల్​ పేరు వినిపించడం గమనార్హం. అయితే వీరు డ్రగ్స్​కేసులో నిందితులా, లేక బాధితులా అన్నవిషయం విచారణ తర్వాత బయటపడనున్నది.