![జనసేనాని ధర్మదీక్ష](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/pavan.jpg?fit=371%2C500&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆలయాలపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ.. సనాతన ధర్మాన్ని పరిరక్షించుకోవాలని పిలుపునిస్తూ శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు దీపాలు వెలిగించే కార్యక్రమానికి జనసేన అధినేత పవన్కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. తన వ్యవసాయ క్షేత్రంలో దీపాన్ని వెలిగించి ‘ధర్మాన్ని పరిరక్షిద్దాం.. మత సమరస్యాన్ని కాపాడుకుందాం’ అని సంకల్పం చెప్పుకొంటూ ధ్యానం చేశారు. ధర్మాన్ని రక్షించుకునే దిశగా అందరూ అడుగులు వేయాలని ఆయన ఆకాంక్షించారు.