Breaking News

జంతు వధ ఆపండి

జంతు వధ ఆపండి

హైదరాబాద్‌: ఒంటెల అక్రమ రవాణా, వధ నిరోధించాలని డాక్టర్‌ శశికళ దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. బక్రీద్‌ సందర్భంగా జంతు వధ జరగకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అక్రమంగా జంతు వధ చేస్తే చర్యలు తీసుకోవాలని తెలిపింది. చైనాలో గబ్బిలాలు తినడం ద్వారా కరోనా వచ్చిందన్న ప్రచారం ఉందని పేర్కొంది.

మాంసం దుకాణాలను జీహెచ్‌ఎంసీ అధికారులు ఎప్పుడైనా తనిఖీ చేశారా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో జంతువధ కేంద్రాలను తనిఖీ చేసినట్లు ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. అక్రమ వధపై రెండు కేసులు నమోదు చేసినట్లు చెప్పింది. రెండు వారాల్లో పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.