Breaking News

చెవిరెడ్డికి సీఎం జగన్​ అభినందనలు

తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని శనివారం సీఎం వైఎస్​ జగన్​మోహన్​రెడ్డి అభినందించారు. రాష్ట్రంలో నాలుగు రాజ్యసభ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ప్రణాళికాబద్దంగా వ్యవహరించి అభ్యర్థుల విజయానికి కృషిచేశారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి 151 ఉన్న సంఖ్యా బలాన్ని చెవిరెడ్డి సమన్వయం చేశారు. కరోనా నేపథ్యంలో పటిష్ట ప్రణాళికతో ఎమ్మెల్యేలందరినీ పోలింగ్ కేంద్రానికి రప్పించడం, వాటిలో ఏ ఒక్క ఓటు వృథాకాకుండా చర్యలు చేపట్టారు.