Breaking News

చంద్రబాబు లీడరా.. బ్రోకరా!

సారథిన్యూస్​, అమరావతి: ఏపీ మాజీసీఎం చంద్రబాబు నాయుడు రాజకీయనాయకుడా.. లేక రియల్​ఎస్టేట్​ బ్రోకరా అని వైఎస్సార్​సీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమరావతి పేరిట జరుగుతున్నది ఉద్యమం కాదని.. రియల్​బ్రోకర్లు ఆడిస్తున్న నాటకమని మండిపడ్డారు. 250 రోజుల ఉద్యమని పచ్చమీడియాలో షో చేస్తున్నారని.. అక్కడ కనీసం 10 మంది కూడా లేరని ఎద్దేవా చేశారు. తన బినామీలను రక్షించుకొనేందుకే బాబు నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. ‘విశాఖపట్టణం మీద చంద్రబాబు ఎందుకు విషం కక్కుతున్నారో అర్థం కావటం లేదు వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. వైజాగ్‌ రాజధానిని అడ్డుకుంటే టీడీపీ నేతలు ద్రోహులుగా మిగిలిపోతారు. చంద్రబాబు చేయిస్తున్న జూమ్‌ ఉద్యమానికి సీపీఐ, సీపీఎం మద్దతు తెలుపుతూ కారల్‌ మార్క్స్‌ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి.’ అంటూ ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు.