Breaking News

కొత్తచట్టంతో కబ్జాలకు చెక్​

సారథి న్యూస్, రామగుండం: సీఎం కేసీఆర్​ తీసుకొచ్చిన కొత్త రెవెన్యూచట్టంతో భూకబ్జాలు, తప్పుడు రిజిస్ట్రేషన్లు, అధికారుల అవినీతికి చెక్​ పడుతుందని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్​ పేర్కొన్నారు. నూతన రెవెన్యూ చట్టాన్ని రైతులు స్వాగతిస్తున్నారని చెప్పారు. ఆదివారం రామగుండం, పాలకుర్తి, అంతర్గాం నుంచి గోదావరిఖని జవహార్​ లాల్​ నెహ్రూ స్టేడియం వరకు ర్యాలీ 500 ట్రాక్టర్లతో ర్యాలీ నిర్వహించారు.

ఈ ర్యాలీని ఎమ్మెల్యే చందర్​, ఎంపీ వెంకటేశ్​ నేతకాని ప్రారంభించారు. ర్యాలీలో మేయర్ డాక్టర్ అనిల్ కుమార్, కార్పొరేటర్లు చాగంటి శంకర్, పాత పెళ్లి లక్ష్మీ ఎల్లయ్య, కుమ్ము వేణుగోపాల్, కుమ్మరి శ్రీనివాస్, కే కృష్ణవేణి భూమయ్య, కే సరూప శ్రీనివాస్ , గొల్లపూడి రమాదేవి శ్రీనివాస్ గౌడ్, ధాతు శ్రీనివాస్, అడ్డాల గట్టయ్య, వాము కుంట్ల భాస్కర్, టిఆర్ఎస్ నాయకులు శంకర్ గౌడ్, మారుతి, బాలరాజు, కే లక్ష్మీనారాయణ, అచ్చ వేణు, దేవరాజు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచ్లు పాల్గొన్నారు.