Breaking News

కిషన్​రెడ్డి వెబ్​సైట్​ హ్యాక్

న్యూఢిల్లీ: కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్​రెడ్డి వ్యక్తిగత వెబ్​సైట్​ హ్యాక్​కు గురైంది. తన వెబ్​సైట్​లో పాకిస్థాన్​కు అనుకూలంగా పోస్టులు ఉండటంతో ఆయన ఈ విషయాన్ని గుర్తించారు. స్వాతంత్ర్య దినోత్సవం రోజున కిషన్​రెడ్డి వెబ్​సైట్​ను హ్యాక్​చేసిన దుండగులు ‘అందులో కశ్మీర్​ ఆజాదీ’ అంటూ పోస్టులు పెట్టారు. దీంతో పాటు మనదేశానికి సంబంధించిన వ్యతిరేక పోస్టులు పెట్టారు. కాగా ఈ విషయంపై కిషన్​రెడ్డి సైబర్​క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం సాంకేతిక బృందం వెబ్‌సైట్‌ను పునరుద్ధరిస్తోంది. కిషన్​రెడ్డి వెబ్​సైట్​ను ఉగ్రవాదులు హ్యాక్​ చేశారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.