Breaking News

కవిత ఘనవిజయం.. కాంగ్రెస్​, బీజేపీ డిపాజిట్లు గల్లంతు

సారథిన్యూస్​, నిజామాబాద్​: ఇందూరు స్థానికసంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేసీఆర్​ కూతురు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ఘన విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో పోటీచేసిన కాంగ్రెస్​, బీజేపీలు డిపాజిట్​ కూడా దక్కించుకోలేకపోయాయి. మొత్తం పోలైన ఓట్లలో కవితకు 728 ఓట్లు వచ్చాయి.
బీజేపీకి 56, కాంగ్రెస్​కు 29 ఓట్లు రాగా.. 10 ఓట్లు చెల్లకుండా పోయాయి. కవిత ఘన విజయం సాధించడంతో టీఆర్​ఎస్​ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. హైదరాబాద్​లోని కవిత ఇంట్లో, ప్రగతిభవన్​లో, తెలంగాణ భవన్​లో సందడి వాతావరణం నెలకొన్నది.