Breaking News

కరోనా @ 872

సారథి న్యూస్​, హైదరాబాద్​: తెలంగాణలో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. రాష్ట్రంలో సోమవారం కొత్తగా 872 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఏడుగురు మృతిచెందారు. మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,674కి చేరింది. రాష్ట్రంలో ఇప్పటివరకు 4,005 మంది కరోనా బారినపడి కోలుకుని డిశ్చార్జ్​ అయ్యారు. మొత్తం మృతుల సంఖ్య 217గా నమోదైంది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,452 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. తాజాగా నమోదైన కేసుల్లో కేవలం జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 713 ఉన్నాయి. రంగారెడ్డి జిల్లాలో 107 కేసులు, మేడ్చల్​ 16, సంగారెడ్డి 12 చొప్పున కేసులు నమోదయ్యాయి.