Breaking News

కరోనా.. ఏపీ కీలక నిర్ణయం

కరోనా.. ఏపీ కీలకనిర్ణయం

సారథి న్యూస్​, కర్నూలు: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైద్యానికి అయ్యే ఖర్చులను నిర్ధారిస్తూ ఉత్తుర్వులు జారీచేసింది. ఈ మేరకు అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో వసూలు చేసే ఫీజులపై వైద్యఆరోగ్య శాఖ స్పెషల్ సెక్రటరీ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం నిర్ధారించిన ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.

క్రిటికల్ గా లేని పేషెంట్ల వైద్యానికి రోజుకు రూ.3,250 గా నిర్ధారించారు. ఎన్ఐవీతో ఐసీయూలో ఉంచి వైద్యం అందిస్తే వారికి రోజుకు రూ.5,980, ఒకవేళ క్రిటికల్ పేషెంట్లకు ఐసీయూలో వెంటిలేటర్లు, ఎన్ఐవీ లేకుండా ఉంచితే రోజుకు రూ. 5,480 గా నిర్ధారించారు. ఇన్ఫెక్షన్ ఉన్నవారికి వెంటిలేటర్ లేకుండా వైద్యం అందిస్తే రూ. 6,280 గా నిర్ణయించారు. ఇన్ఫెక్షన్ ఉండి, వెంటిలేటర్ పెట్టి వైద్యం అందిస్తే రోజుకు రూ.10,380 గా నిర్ధారించారు. వెంటిలేటర్ సహాయంతో వైద్యం అందిస్తే రూ.9,580 గా నిర్ణయించారు. ఆరోగ్య శ్రీ పథకం కింద ఉన్న ఆస్పత్రులు అన్ని కూడా ఇవే ఫీజులను వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.