Breaking News

కరోనాతో 10 మంది మృతి

కరోనాతో ఒకేరోజు 10 మంది మృతి

సారథి న్యూస్, హైదరాబాద్​: తెలంగాణలో శనివారం(24 గంటల్లో) 2,278 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 1,54,880కు చేరింది. మహమ్మారి బారినపడి తాజాగా 10 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తం మృతుల సంఖ్య 950కు చేరింది. ఒక్కరోజే 2,458 మంది కోవిడ్‌ రోగులు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇలా ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,21,925కు చేరింది. రాష్ట్రంలో యాక్టివ్‌ కేసులు 32,005 ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 77.75 శాతంగా ఉండగా, తెలంగాణలో 78.7 శాతంగా నమోదైంది. భారత్‌లో మరణాల రేటు 1.66 శాతం ఉండగా, రాష్ట్రంలో 0.61 శాతంగా రికార్డు అయింది. తాజాగా 62,234 వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు మొత్తంగా 20,78,695 కరోనా నిర్ధారణ టెస్టులు చేశారు.

వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన బులెటిన్​