Breaking News

కరోనాతో ఖాకీల పోరాటం

సారథి న్యూస్​, హైదరాబాద్​: కరోనా వైరస్ హైదరాబాద్ పోలీస్ శాఖలో భయం పుట్టిస్తోంది. డిపార్ట్​మెంట్​లో పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. తాజాగా బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నిన్న ఏడుగురు పోలీసులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కాగా, శుక్రవారం ఆ సంఖ్య 15కు చేరింది.. ఇప్పటి వరకు బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోనే 15 మంది పోలీసు అధికారులకు కరోనా సోకడంతో ఖాకీలు హడలిపోతున్నారు. మూడు రోజుల నుంచి మెడికల్​ టెస్టుల్లో వరుసగా కరోనా కేసులు బయట పడుతున్నాయి. కనిపించని శత్రువు కరోనాతో ముందుండి పోరాటం చేస్తున్న పోలీసులను కరోనా వెంటాడడం ఆందోళన కలిగించే విషయమే. దీంతో అప్రమత్తమైన అధికారులు సరైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.