Breaking News

ఓటు వేసిన ప్రముఖులు

ఓటు వేసిన ప్రముఖులు

సారథి న్యూస్​, హైదరాబాద్​: జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో మంగళవారం పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​, మంత్రి కె.తారకరామారావు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, హోంమంత్రి, డిప్యూటీ సీఎం మహమూద్​అలీ, డీజీపీ ఎం.మహేందర్​రెడ్డి కుందన్​బాగ్​ పోలింగ్​ బూత్​లో, హైదరాబాద్​ పోలీస్​ కమిషనర్​ సజ్జనార్​ కుటుంబసమేతంగా తమ ఓటువేశారు. అలాగే సికింద్రాబాద్ లోని ఇస్లామియా స్కూలులో డిప్యూటీ స్పీకర్​ టి.పద్మారావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఖైరతాబాద్ సర్కిల్ సోమాజిగూడ వార్డు నం.97, సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ వద్ద పోలింగ్ నంబర్ 3లో తెలంగాణ రాష్ట్ర గిరిజన, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఓటు వేశారు. ఈ సందర్భంగా డీజీపీ ఎం.మహేందర్​రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలంతా ధైర్యంగా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని అన్నారు. పోలింగ్​ ప్రశాంతంగా జరిగేందుకు పోలీసుశాఖ అన్నిరకాల చర్యలు తీసుకుందని వివరించారు.

ఓటు వేస్తున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
ఓటు వేసిన అనంతరం సిరా మార్కు చూపుతున్న డీజీపీ ఎం.మహేందర్​రెడ్డి దంపతులు
ఓటు వేసిన సీపీ సజ్జనార్​ దంపతులు
ఫ్యామిలీతో కలిసి ఓటు వేసిన అనంతరం డిప్యూటీ స్పీకర్​ పద్మారావుగౌడ్​
ఓటు వేసిన మహిళా శిశుసంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్​
ఓటు వేస్తున్న డిప్యూటీ సీఎం, రాష్ట్ర హోంమంత్రి మహమూద్​ అలీ
ఓటు వేసిన అనంతరం సిరా మార్కు​ చూపుతున్న ఒవైసీ