Breaking News

ఒకేరోజు 920 కరోనా కేసులు

సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. చాపకింద నీరులా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ రోగుల సంఖ్య పెరుగుతోంది. గురువారం తాజాగా 920 కేసులు నమోదయ్యాయి. ఇలా రాష్ట్రంలో 11వేల పాజిటివ్​కేసులు నిర్ధారణ అయ్యాయి. మహమ్మారి బారినపడి ఐదుగురు మృత్యువాతపడ్డారు. దీంతో మరణాల సంఖ్య 230కి చేరింది. జీహెచ్​ఎంసీ పరిధిలో 737, రంగారెడ్డి జిల్లా నుంచి 86, మేడ్చల్​జిల్లాలో 60, కరీంనగర్ జిల్లాలో 23 కేసుల చొప్పున నమోదయ్యాయి. ప్రస్తుతం 6,446 యాక్టివ్​కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్​బులిటెన్​లో పేర్కొంది.