Breaking News

ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులు మాములుగా లేవుగా!

అక్రమాస్తుల కేసులో ఏసీబీ చిక్కిన మల్కాజ్​గిరి ఏసీపీ నరసింహారెడ్డి ఆస్తులు చూస్తుంటే ఏసీబీ అధికారులకే దిమ్మతిరిగిపోతుందట. అతడికి ఏకంగా రూ. 100 పైనే ఆస్తులున్నట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం నాంపల్లి ఏసీబీ కార్యాలయంలో నరసింహారెడ్డిని విచారిస్తున్నారు. నరసింహారెడ్డికి ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాలో 55 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్టు సమాచారం. మరోవైపు నిన్న జరిపిన సోదాల్లో ఏసీపీ ఇంట్లో 15 లక్షల నగదు, బంగారు, వెండి ఆభరణాలు గుర్తించారు. హైదరాబాద్​లో రెండు ఇండ్లు, హఫీజ్​పేట్​లో 3 జీ ప్లస్ కమర్షియల్ కాంప్లెక్స్‌లు, సైబర్‌ టవర్స్‌ ముందు 4 ఓపెన్​ప్లాట్లు, అనంతపురం జిల్లాలో 55 ఎకరాల వ్యవసాయభూమి. అయితే లాకర్లను చూస్తే మరిన్ని వివరాలు బయటపడనున్నట్టు సమాచారం. అయితే ఇటీవల నరసింహారెడ్డి ఘట్‌కేసర్ సమీపంలోని యమాన్ పేట్‌లో.. 30 ఎకరాల వివాదాస్పద భూమిని కొనుగోలు చేసినట్లు ఆరోపణలున్నాయి. అయితే ఇందులో ఓ ప్రజాప్రతినిధి పాత్ర కూడా ఉన్నట్టు టాక్​

ఏసీబీ ఆస్తుల చిట్టా ఇదే..!

  • ఏసీపీ అక్రమాస్తులు @ రూ.100కోట్లపైనే
  • అనంతపురంలో 55 ఎకరాల వ్యవసాయ భూమి
  • మాదాపూర్ లో సైబర్ టవర్స్ ముందు 4 ప్లాట్లు
  • 2 హౌస్ ప్లాట్లు ( హైదరాబాద్​)
  • హఫీజ్ పేట్ లో కమర్షియల్ జీప్లస్​ 3 బిల్డింగ్​
  • 2 ఇళ్లు ( హైదరాబాద్​)
  • రూ.15 లక్షల నగదు
  • 2 బ్యాంకు లాకర్లు
  • రియల్ ఎస్టేట్ ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు