Breaking News

ఏపీలో 8,601 పాజిటివ్​ కేసులు

ఏపీలో 8,601 పాజిటివ్​కేసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్​లో సోమవారం(24గంటల్లో) 8,601 కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా 86 మంది మృతిచెందారు. ఇప్పటివరకు 3,368 మంది మృత్యువాతపడ్డారు. రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 3,58,817కు చేరింది. 24 గంటల్లో 54,463 శాంపిల్స్‌ టెస్టులు చేయగా, ఇప్పటివరకు చేసిన పరీక్షల సంఖ్య 32,92,501కు చేరింది. గత 24 గంటల్లో 8,741 మంది డిశ్చార్జ్ కాగా.. ఇప్పటివరకు మహమ్మారి బారినపడి 2,68,828 మంది కోలుకున్నారు. ఏపీలో ప్రస్తుతం 89,516 యాక్టివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఏపీ వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్​ బులెటిన్​

ఇక జిల్లాల వారీగా పరిశీలిస్తే.. అనంతపురం 933, చిత్తూరు 495, ఈస్ట్ గోదావరి 1,441, గుంటూరు 467, కడప 639, కృష్ణా 154, కర్నూలు 484, నెల్లూరు 965, ప్రకాశం 589, శ్రీకాకుళం 485, విశాఖపట్నం 911, విజయనగరం 572, వెస్ట్​గోదావరి 466 చొప్పున పాజిటివ్​కేసులు నమోదు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ హెల్త్​బులెటిన్​లో పేర్కొంది.