Breaking News

ఎమ్మెల్యే తండ్రి దశదినకర్మకు సీఎం కేసీఆర్​ హాజరు

ఎమ్మెల్యే తండ్రి దశదినకర్మకు సీఎం కేసీఆర్​హాజరు

సారథి న్యూస్, హైదరాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తండ్రి కృష్ణమూర్తి ఇటీవల కన్నుమూశారు. బుధవారం మాక్లూర్ మండల కేంద్రంలోని ఎమ్మెల్యే స్వగృహంలో నిర్వహించిన ద్వాదశ దినకర్మలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాల్గొన్నారు. రోడ్డు మార్గం ద్వారా ఆయన అక్కడికి నేరుగా వెళ్లి ఎమ్మెల్యే గణేష్ గుప్తా కుటుంబసభ్యులను పరామర్శించి ఓదార్చారు. అంతకుముందు కృష్ణమూర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీఎం వెంట హోంశాఖ మంత్రి మహమూద్​అలీ, మంత్రులు అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్, ఎమ్మెల్సీ కేఆర్ సురేష్ రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎమ్మెల్యేలు సురేందర్, బాజిరెడ్డి గోవర్దన్, హనుమంతు షిండే, జీవన్​రెడ్డి ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.