Breaking News

ఊపిరాడక చిన్నారుల మృతి

సారథిన్యూస్​, అమరావతి: సరదాగా ఆడుకోవడానికి కారులోకి వెళ్లిన చిన్నారులు డోర్​ లాక్​కావడంతో ఊపిరాడక మృతిచెందారు. ఈ విషాద ఘటన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం రేమల్లెలో చోటు చేసుకుంది. అప్సానా ,యాసిన్ ,పర్వీన్ అనే ముగ్గురు చిన్నారులు ఆడుకోవడం కోసం తమ ఇంటి దగ్గర పార్క్ చేసిన కారులోకి ఎక్కారు. అయితే ప్రమాదవశాత్తూ ఆ కారు డోర్ లాక్ అయ్యింది. దీంతో ఆ చిన్నారులు బయటకు వచ్చేందుకు ఎంతగానో ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది. దీంతో ముగ్గురు చిన్నారులు ఊపిరాడక కారులోనే ప్రాణాలు వదిలారు. వీరి కోసం తల్లిదండ్రులు గాలించగా, చివరకు కారులో విగతజీవులుగా కనిపించారు. చిన్నారుల మరణంతో ఆ కాలనీలో విషాధం అలుముకున్నది.