Breaking News

ఉద్యోగాన్ని సొంతపనిలా భావించాలె

ఉద్యోగాన్ని సొంతపనిలా భావించాలె

సారథి న్యూస్​, మహబూబ్ నగర్: నూతనంగా నియమితులైన డిప్యూటీ తహసీల్దార్లు నిజాయితీగా పనిచేసి పేదలకు అండగా నిలవాలని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఉద్యోగాన్ని కూడా తమ సొంత పనిలా భావించి కష్టపడి పనిచేస్తే రాణిస్తారని హితబోధ చేశారు. శనివారం ఆయన మహబూబ్ నగర్ జడ్పీ మీటింగ్​హాల్​లో నూతన డిప్యూటీ తహసీల్దార్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రెవెన్యూ శాఖకు గతం నుంచి మంచిపేరు ఉందన్నారు. సంక్షేమశాఖ ఆధ్వర్యంలో బ్యాక్​లాగ్​ ద్వారా భర్తీచేసిన పోస్టులకు గానూ పదిమందికి నియామక ఉత్తర్వులు అందజేశారు. దివ్యాంగులకు సాధ్యమైనంత వరకు దగ్గరంలోనే పోస్టింగ్ ఇవ్వాలని, పనిభారం తక్కువగా ఉండేలా చూసి సహకరించాలని సూచించారు. కలెక్టర్ ఎస్.వెంకట్రావు మాట్లాడుతూ 32 మంది నూతన డిప్యూటీ తహసీల్దార్లతో పాటు సంక్షేమశాఖ ద్వారా 20 దివ్యాంగుల పోస్టులకు గానూ మహబూబ్​నగర్ జిల్లా పరిధిలోకి వచ్చేలా 10 పోస్టులను క్లియర్ చేసి ఉత్తర్వులు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, డీఆర్వో స్వర్ణలత, జడ్పీ సీఈవో, జిల్లా సంక్షేమాధికారి యాదయ్య పాల్గొన్నారు.