Breaking News

‘ఈ-ఆఫీసు’తో పారదర్శక సేవలు

‘ఈ-ఆఫీసు’తో పారదర్శక సేవలు

సారథి న్యూస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్​ఆదేశాల మేరకు ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు సమర్థవంతమైన, కచ్చితమైన సేవలు అందించేందుకు ఈ-ఆఫీసును ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్​కుమార్ తెలిపారు. బీఆర్​కేఆర్​భవన్​లో కొనసాగుతున్న సెక్రటేరియట్ లోని ​8 ప్రభుత్వ శాఖల్లో సేవలను సోమవారం ఆయన ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ-ఆఫీసు ద్వారా పారదర్శకమైన, బాధ్యతాయుతంగా, వేగంగా ప్రాసెస్ చేయడానికి వీలు కలుగుతుందన్నారు. ఎక్కడి నుంచైనా పనిచేయడానికి వీలవుతుందన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 15 శాఖల్లో అమలు చేస్తున్నామని వెల్లడించారు. మిగతా శాఖల్లో వారం రోజుల్లోగా పూర్తిచేయాలని సూచించారు. కార్మికశాఖ స్పెషల్ సీఎస్ ​రాణికుముదిని, ఐటీశాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్, హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, పీసీబీ మెంబర్ సెక్రటరి నీతూ కుమారిప్రసాద్, ఆర్థికశాఖ స్పెషల్ సెక్రటరీ రోనాల్డ్ రోస్, షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ స్పెషల్ సెక్రటరీ విజయ కుమార్ పాల్గొన్నారు.