Breaking News

ఇదేనా బంగారు తెలంగాణ

సారథి న్యూస్, కరీంనగర్: సీఎం కేసీఆర్​ రాచరికపు పోకడలతో తెలంగాణ అస్థిత్వాన్ని సర్వనాశనం చేస్తున్నారని కరీంనగర్​ జిల్లా కాంగ్రెస్​ పార్టీ బీసీ సెల్​ అధ్యక్షుడు పులి ఆంజనేయులు విమర్శించారు. అమరవీరుల త్యాగాలతో ఏర్పడ్డ తెలంగాణను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. గురువారం ఆయన కరీంనగర్​లో మీడియాతో మాట్లాడారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు వీఆర్వో వ్యవస్థ రద్దు అనే అంశాన్ని తెరమీదకు తెచ్చారని ఆరోపించారు. పేదల కష్టపడి డబ్బుసంపాధించి.. ఆ డబ్బులతో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేస్తే ఎల్​ఆర్​ఎస్​ పేరుతో దోపిడీకి తెరలేపారని ఆరోపించారు. ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు మడుపు మోహన్, నగర బీసీ సెల్ ప్రెసిడెంట్ బోనాల శ్రీనివాస్, కరీంనగర్ నగర ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ లింగంపల్లి బాబు, రోళ్ల సతీశ్​, బానోతు శ్రవణ్ తదితరులు పాల్గొన్నారు.