Breaking News

‘ఇది బీసీల ప్రభుత్వం’

‘ఇది బీసీల ప్రభుత్వం’

సారథి న్యూస్, శ్రీకాకుళం: ఏపీ సీఎం డాక్టర్​వైఎస్​జగన్​మోహన్​రెడ్డి 56మంది కార్పొరేషన్ల చైర్మన్లు, 672 మంది డైరెక్టర్లను ప్రకటించిన శుభ సందర్భంగా ఇందులో మహిళలకు 50శాతం పైగా రిజర్వేషన్లు కల్పించడం మరో విశేషమని మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావు, రాష్ట్రమంత్రి సీదిరి అప్పలరాజు, కేంద్రమాజీ మంత్రి జిల్లా వైఎస్సార్​సీపీ అధ్యక్షురాలు డాక్టర్​కిల్లి కృపారాణి కొనియాడారు. డాక్టర్​వైఎస్​రాజశేఖరరెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఏడు రోడ్ల కూడలిలో వైఎస్సార్​విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కేవలం 16నెలల్లోనే వివిధ పథకాల ద్వారా 2,71,37,253 మంది లబ్ధిదారులకు దాదాపు రూ.33,500 కోట్లు ఖర్చుచేసిందన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ పీరియా సాయిరాజ్, జిల్లా పార్టీ నేతలు పాల్గొన్నారు.