Breaking News

ఆశా కార్యకర్తల కృషి అద్భుతం

సారథి న్యూస్​, నాగర్​కర్నూల్​: కరోనా నివారణకు ఆశా కార్యకర్తలు అద్భుతంగా పనిచేస్తున్నారని నాగర్​కర్నూల్​ జిల్లా అడిషనల్​ కలెక్టర్​ మనుచౌదరి ప్రశంసించారు. గురువారం కలెక్టరేట్​లో రెడ్​క్రాస్​ సొసైటీ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను సబ్బులు, శానిటైజర్లు, ఫ్రూట్​జ్యూస్​ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మనుచౌదరి మాట్లాడుతూ.. కరోనా నివారణకు వైద్యసిబ్బంది, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ తిరుగుతూ వైద్యసేవలు అందిస్తున్నారని అభినందించారు. కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ సెక్రటరీ రమేశ్​రెడ్డి, ట్రెజరర్ రాధాకృష్ణ, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డి.కుమార్, బ్లడ్ డొనేషన్ కన్వీనర్ రాజ్ కుమార్, నాగర్ కర్నూల్ మండల వైద్యాధికారి డాక్టర్​ దశరథం, రెడ్ క్రాస్ సభ్యులు కృష్ణారావు, రమాదేవి, కేశవులు, ఏఎన్​ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.