Breaking News

ఆజాద్​పై వేటు.. కొంపముంచిన ‘లేఖ’

ఢిల్లీ: కాంగ్రెస్​ సీనియర్​ నేత గులాం నబీ ఆజాద్​కు ఆ పార్టీ అధిష్ఠానం గట్టి షాకే ఇచ్చింది. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఆజాద్​ను తొలిగించింది. ఆజాద్​తో పాటూ అంబికా సోని, మల్లికార్జున ఖర్గే, మోతీలాల్​ వోరా తదితరులపై కూడా వేటు పడింది. కాంగ్రెస్​ పార్టీలో ప్రక్షాళన అవసరం అంటూ ఇటీవల ఆ పార్టీకి చెందిన సీనియర్​ నేతలు బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖరాసిన వారిలో ఆజాద్​ ముఖ్యుడు. ఈ విషయంపై పార్టీలో తీవ్ర దుమారం చెలరేగింది. కాంగ్రెస్​ యువనేత రాహుల్​ గాంధీ సైతం పార్టీ సీనియర్లపై సీరియస్​ అయ్యారు. కాగా కాంగ్రెస్​ పార్టీ తాజాగా సీడబ్ల్యూసీని పునర్వ్యస్థీకరించింది. ఈ కమిటీలో పలువురు సీనియర్లను పక్కన పెట్టింది. ఆజాద్​ ఇప్పటివరకు యూపీ కాంగ్రెస్​ ఇంచార్జిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయనను ఆ పదవినుంచి కూడా తప్పించారు.

తెలంగాణ ఇంచార్జిగా మాణికం ఠాకూర్​
తెలంగాణ కాంగ్రెస్​ పార్టీ వ్యవహారాల ఇంచార్జిగా మాణికం రాకూర్​ను కాంగ్రెస్​ పార్టీ నియమించింది. ఇప్పటివరకు ఇక్కడ ఇంచార్జిగా ఉన్న కుంతియాను తప్పించారు. యూపీ కాంగ్రెస్​ ఇంచార్జిగా ప్రియాంకా గాంధీ, ఆంధ్రప్రదేవ్​ కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌గా ఉమెన్‌చాందీని కాంగ్రెస్​ అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటనను విడుదల చేసింది.