![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/HYDERABADD..-KARIMNAGARRGG.jpg?fit=700%2C356&ssl=1)
సారథిన్యూస్, రామడుగు: పనుల్లో అలసత్వాన్ని సహించే ప్రసక్తే లేదని డీఆర్డీవో వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. శనివారం ఆయన కరీంనగర్ జిల్లా రామడుగు మండలం దేశురాజ్పల్లి గ్రామంలో పర్యటించారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కలకు నీరు పట్టేందుకు వెంటనే నీటి తొట్టెల ను నిర్మించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గ్రామంలో రోడ్డుకిరువైపులా నాటిన మొక్కలను పరిశీలించారు. కార్యక్రమంలో ఏపీడీవో మంజుల దేవి, ఎంపీడీవో మల్హోత్ర, ఎస్సారెస్పీ డీఈ, సర్పంచ్ కోల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.