Breaking News

అడ్డంగా దొరికిన పెద్ద డాక్టర్

లంచం తీసుకుంటూ దొరికిన పెద్దడాక్టర్​

సారథిన్యూస్​, గద్వాల: లంచం తీసుకుంటూ జోగుళాంబ గద్వాల జిల్లా డీఎంహెచ్​వో భీమ్​నాయక్​ ఏసీబీ అధికారులను రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని వడ్డేపల్లి మండలంలో డాక్టర్​ ఏ మంజుల మెడికల్​ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆమె కాకతీయ యూనివర్సిటీలో పీజీలో జాయిన్​ అయ్యారు. ఇందుకోసం రిలీవింగ్​ ఆర్డర్​ కోసం డీఎంహెచ్​వోకు దరఖాస్తు చేసుకున్నారు. లంచాలకు అలవాటు పడ్డ డీఎంహెచ్​వో తన కిందిస్థాయి ఉద్యోగిని సైతం రూ. 7000 లంచం అడిగాడు. దీంతో మంజుల ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన అధికారులు గురువారం సదరు డీఎంహెచ్​వో తన కార్యాలయంలో లంచం తీసుకుంటుండగా రెడ్​హ్యెండెడ్​గా పట్టుకున్నారు.