![‘సన్రైజర్స్’ సూపర్ విక్టరీ](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/10/HYD2.jpg?fit=677%2C451&ssl=1)
దుబాయ్: ఐపీఎల్13 సీజన్లో భాగంగా దుబాయ్ వేదికగా శుక్రవారం చెన్నై సూపర్ కింగ్స్తో అత్యంత ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో సన్రైజర్స్ హైదరాబాద్ ఏడు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత టాస్ గెలిచిన హైదరాబాద్ బ్యాటింగ్ ఎంచుకుంది. చెన్నైకి 165 టార్గెట్ విసిరింది. చివరి ఓవర్లలో ప్రియమ్ గార్గ్ తనదైన బ్యాటింగ్, మెరుపు షాట్లతో మెరిపించాడు. హైదరాబాద్ బ్యాట్స్మెన్లు వార్నర్ 28(29), ఎంకే పాండే 29(21), ప్రియమ్ గార్గ్ 51(26), అభిషేక్ శర్మ 31( 24) చెప్పుకోదగ్గ పరుగులతో మొత్తం 164 రన్స్ చేశారు. ఇక చెన్నై బౌలర్లు డీఎల్ చాహర్ రెండు, ఎస్ఎన్ ఠాకుర్ ఒకటి, పీపీ చావ్లా ఒకటి చొప్పున వికెట్లు తీశారు.
లక్ష్యఛేదనలో భాగంగా బరిలోకి దిగిన ధోనీ సేన చెన్నై సూపర్ కింగ్స్ చకచకా వికెట్లను కోల్పోయి మ్యాచ్ను చేజార్చుకుంది. ఓపెనర్ డుప్లెసిస్ 22 (19), ఎంఎస్ ధోనీ 47 (36 నాటౌట్), రవీంద్ర జడేజా 50 (35, ఐదు ఫోర్లు, రెండు సిక్స్లు), ఎస్ఎం కరణ్ 8(3).. టాప్ ఆర్డర్లో ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్ బాట పట్టారు. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 157 పరుగులు మాత్రమే చేసింది. హైదరాబాద్ సన్రైజర్స్బౌలర్లు భువనేశ్వర్ కుమార్ ఒకటి, టి.నటరాజన్రెం డు, అబ్దుల్అహ్మద్ ఒకటి చొప్పున వికెట్లు తీశారు.