![కరెంట్ షాక్తో 45గొర్రెలు మృతి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/WhatsApp-Image-2020-07-25-at-2.03.23-PM.jpeg?fit=1032%2C774&ssl=1)
సారథి న్యూస్, అనంతపురం : కరెంట్ షాక్తో భారీ సంఖ్యలో గొర్రెలు మృత్యువాతపడ్డాయి. వివరాలు.. అనంతపురం జిల్లా గోరంట్ల మండల పరిధిలోని మందలపల్లి పంచాయతీలోని కరావులపల్లి తండాలో శనివారం షార్ట్ సర్క్యూట్తో విద్యుత్ షాక్ తగిలి శంకర్ నాయక్ అనే రైతుకు చెందిన 45 గొర్రెలు చనిపోయాయి. జీవనాధారం కోల్పోవడంతో రైతు కుటుంబీకులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరుతున్నారు.