![వరద ప్రాంతాల్లో మంత్రి పర్యటన](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/mbnr-2.jpg?fit=677%2C381&ssl=1)
సారథి న్యూస్, మహబూబ్ నగర్: మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ శనివారం పర్యటించారు. నాలాలపై చేపట్టిన అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మంత్రి జిల్లా కేంద్రంలో భారీవర్షం కారణంగా జలమయమైన ప్రాంతాల్లో పర్యటించారు. రామయ్యబౌలి, బీకేరెడ్డి కాలనీ, భగీరథ కాలనీ, గణేష్ నగర్, ఎంబీసీ కాంప్లెక్స్, బృందావన్ కాలనీలో కలియతిరిగారు. జలదిగ్బంధమైన ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాలను వెంటనే కూల్చివేయాలన్నారు. గతంలో రామయ్యబౌళి ప్రాంతంలో నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణాల కూల్చివేత వల్ల ఆ ప్రాంతంలో వరద ప్రభావం చాలావరకు తగ్గిందన్నారు. ఆవయన వెంట మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు ఉన్నారు.