Breaking News

రియా ఏం చెప్పింది..?

సుశాంత్​ రాజ్​పుత్​ కేసు దేశంలోనే పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో మొదటి నుంచి సుశాంత్​ ప్రేయసి రియా చక్రవర్తి ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఆమెను ఇప్పటికే ఎన్​సీబీ అరెస్ట్​ చేసింది. అయితే రియాకు డ్రగ్స్​ మాఫియాతో సంబంధాలు ఉన్నట్టు సీబీఐ, ఎన్సీబీ విచారణలో తేలింది. దీంతో ఈ కేసులో పలు సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. బాలీవుడ్​కు చెందిన అనేకమంది ప్రముఖులు డ్రగ్స్​ తీసుకుంటున్నట్టు పోలీసులకు ఆధారాలు దొరికాయి. ఈ విషయంపై ఇప్పటికే జాతీయమీడియాలో వార్తలు వస్తున్నాయి.

బాలీవుడ్​కు చెందిన 25 మంది డ్రగ్స్​ తీసుకుంటారని రియా.. సీబీఐకి చెప్పినట్టు సమాచారం. తీగ లాడితే డొంకంతా కదిలినట్టుగా.. సుశాంత్​ కేసులో సీబీఐకి డ్రగ్స్​మాఫియాకు సంబంధించిన ఆధారాలు దొరికాయి. అయితే రియా చెప్పిన ఆ 25 మంది ఎవరన్న అంశం ప్రస్తుతం ముంబైలో చర్చనీయాంశమైంది. సుశాంత్​ మరణం తర్వాత బాలీవుడ్​ మొత్తం అట్టుడుకుతోంది. కొంతకాలం పాటు నెపోటిజం వివాదం తెరమీదకు రాగా ప్రస్తుతం డ్రగ్స్​మాఫియా వ్యవహరం నడుస్తోంది. నిజంగా డ్రగ్స్​ మాఫియాతో ఎంతమందికి సంబంధం ఉంది.. పోలీసులు ఎవరెవరిని అరెస్ట్​ చేయనున్నారో అన్న అంశంమై ప్రస్తుతం ముంబైలో ఆసక్తి నెలకొంది.