![రాశీ కన్నాతో మరోసారి](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/RASHI-RAVITEJA-NEWWFF.jpg?fit=700%2C467&ssl=1)
కొన్నేండ్లుగా సరైన హిట్ పడకపోవడంతో రవితేజ డీలా పడిపోయాడు. మార్కెట్ కూడా తగ్గిపోయింది. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్కొట్టాలని కసిగా ఉన్నాడు. ఈ క్రమంలో గోపిచంద్ మలినేని డైరెక్షన్లో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో శృతీహాసన్ హీరోయిన్గా నటిస్తుండగా.. తమన్ బాణీలు సమకూర్చుతున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే.. రాక్షసుడు ఫేమ్ రమేశ్వర్మతో మరో సినిమాలో నటిస్తున్నట్టు ప్రకటించాడు రవితేజ. ఈ చిత్రంలో ఆయన డబల్ రోల్ చేయనున్నట్టు టాక్. ఇప్పటికే నిధి అగర్వాల్ హీరోయిన్గా ఎంపికైంది. మరో నాయికగా రాశీ కన్నాను ఫైనల్ చేసిందట చిత్ర యూనిట్.