Breaking News

రావొచ్చు.. పోవచ్చు

రావొచ్చు.. పోవచ్చు

  • ములుగు జిల్లాలో టూరిస్టు ప్రదేశాలకు అనుమతి
  • కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి: డీఎఫ్ వో

సారథి న్యూస్, ములుగు: ములుగు జిల్లాలో ఉన్న ప్రఖ్యాత పర్యాటక ప్రాంతాలైన బొగత వాటర్ ఫాల్స్, తాడ్వాయి హాట్స్, లక్నవరం ఎకో పార్కుల్లో పర్యాటకులను అక్టోబర్ 1వ తేదీ నుంచి అనుమతించనున్నట్లు డీఎఫ్​వో ప్రదీప్ కుమార్ శెట్టి తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. పర్యాటకులు తప్పనిసరిగా మాస్కు పెట్టుకుని, శానిటైజర్ వెంట తీసుకురావాలని సూచించారు. కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించి, సరైన జాగ్రత్తలు తీసుకోవాలని డీ ఎఫ్ వో సూచించారు.