![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/CONGRESSFF.jpg?fit=700%2C353&ssl=1)
సారథి న్యూస్, రామడుగు: మాజీ ప్రధాని రాజీవ్గాంధీ సేవలు చిరస్మరణీయమని కరీంనగర్ యూత్ కాంగ్రెస్ పార్లిమెంట్ అధ్యక్షుడు నాగి శేఖర్ కొనియాడారు. గురువారం రాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా రాజీవ్ సద్భావాన దినోత్సవాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలోని దళిత కాలనీలో నాగిశేఖర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలపడానికి రాజీవ్ గాంధీ కృషి ఎనలేనిదని కొనియాడారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నీలం దేవకిషన్, నాయకులు పరశురాములు, రవీందర్, శ్రీను, చింటూ, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.