Breaking News

మరో టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేకు కరోనా

మరో టీఆర్ఎస్ ఎమ్మెల్యే కు కరోనా

సారథిన్యూస్​, హైదరాబాద్​ : కరోనా బారిన పడి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కోలుకున్నారు. కొవిడ్​ దాటికి కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా అధికార పార్టీ టీఆర్​ఎస్​కు చెందిన ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. దీంతో తన కుటుంబ సభ్యులకు, ఇంట్లో పని వారికీ కూడా కరోనా టెస్టులు చేయించారు. సుధీర్​రెడ్డి భార్య, ఇద్దరు కొడుకులు, వంటమనిషికి కరోనా సోకినట్లు అధికారులు తెలిపారు. డాక్టర్ల సలహాల మేరకు తన కుటుంబ సభ్యులందరూ హోమ్ క్వారంటైన్ లో ఉన్నారు. తెలంగాణ లో ఇప్పటికే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాలా గణేష్ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కరోనా బారిన పడి కోలుకున్నారు.