![చేవెళ్లలో గుట్కా సీజ్](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/CHEVELLA-GUTKAFFF.jpg?fit=700%2C413&ssl=1)
సారథిన్యూస్, చేవెళ్ల: అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను టాస్క్ఫోర్స్ పోలీసులు సీజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్స్టేషన్ పరిధిలోని బీబీగూడెం వద్ద టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేపట్టగా సుమారు రూ. 2 లక్షల 45 వేల విలువైన గుట్కాప్యాకెట్లు పట్టుబడ్డాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఇద్దరు నిందితులు గుట్కా ప్యాకెట్లను హైదరాబాద్ నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీబీగూడెనికి తీసుకెళ్తున్నట్టు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకొని కారును సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.