సారథి న్యూస్టీం: 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఇతర ప్రముఖులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి సెల్యూట్చేశారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. అసెంబ్లీ అవరణలో నిర్వహించిన వేడుకల్లో స్పీకర్పోచారం శ్రీనివాస్రెడ్డి పాల్గొన్నారు. ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు. రంగారెడ్డి కలెక్టరేట్లో జరిగిన సంబరాల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. సూర్యాపేట కలెక్టరేట్లో జరిగిన వేడుకల్లో మంత్రి జి.జగదీశ్వర్రెడ్డి పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకల్లో సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని జెండాను ఎగరవేశారు. అలాగే సిద్దిపేట జిల్లా కేంద్రంలోని తన నివాసంలో ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసి రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. నాగర్కర్నూల్జిల్లా అచ్చంపేటలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్జాతీయ జెండాను ఎగరవేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగిన వేడుకల్లో మండలిలో ప్రభుత్వ విప్కూచకుళ్ల దామోదర్రెడ్డి పాల్గొన్నారు.
- August 15, 2020
- Archive
- Top News
- తెలంగాణ
- CM KCR
- HYDERABAD
- PRAGATHIBHAVAN
- TELANGANA
- ఇండిపెండెన్స్డే
- తెలంగాణ
- హైదరాబాద్
- Comments Off on నిరాడంబరంగా ఇండిపెండెన్స్ డే