Breaking News

నాగర్​కర్నూల్ ​కలెక్టర్ పై బదిలీ వేటు

నాగర్​కర్నూల్ ​కలెక్టర్ పై బదిలీ వేటు

సారథి న్యూస్, నాగర్​కర్నూల్: నాగర్​కర్నూల్​ కలెక్టర్ ​ఈ.శ్రీధర్​పై ఆదివారం బదిలీవేటు పడింది. వనపర్తి జిల్లా కలెక్టర్​ యాష్మిన్​బాషాకు నాగర్​కర్నూల్ ​జిల్లా కలెక్టర్​గా ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సరిగ్గా నిర్వహించలేదనే కారణంతో బదిలీ వేటుపడినట్లు తెలుస్తోంది. అలాగే గృహనిర్మాణశాఖ అదనపు బాధ్యతల నుంచి ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్​ను ప్రభుత్వం తప్పించింది. ఆమె స్థానంలో సునీల్​శర్మకు అదనపు బాధ్యతలు అప్పగించింది.