Breaking News

ధరణితో ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు

ధరణితో ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు

సారథి న్యూస్, బిజినేపల్లి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ధరణి వెబ్​సైట్​ ద్వారా రిజిస్ట్రేషన్లు ఏకకాలంలో పూర్తయి వెంటనే వారికి పాస్ పుస్తకంలో భూమి వివరాలు నమోదవుతాయని నాగర్ కర్నూల్ జిల్లా అడిషనల్ ​కలెక్టర్ ​హన్మంత్​రెడ్డి అన్నారు. సోమవారం నాగర్ కర్నూల్​ జిల్లా బిజినేపల్లి తహసీల్దార్​ఆఫీసులో ధరణి వెబ్​సైట్ ​ద్వారా రిజిస్ట్రేషన్ల ప్రక్రియను ప్రారంభించారు. ఈ వెబ్​సైట్​ ద్వారా కొనుగోలుదారులతో పాటు ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రిజిస్ట్రేషన్ ఈజీగా అవుతుందన్నారు. రిజిస్ట్రేషన్ అయిన కొద్ది సమయంలోనే పాస్​ బుక్కులు కూడా వస్తాయని వివరించారు. ఆయన వెంట తహసీల్దార్​ అంజిరెడ్డి, రైతులు ఉన్నారు.