Breaking News

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం

సారథి న్యూస్​, హైదరాబాద్: వేగంగా విజృంభిస్తున్న మహమ్మారిని అరికట్టేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ ఆస్పత్రుల్లోనూ ఫ్రీగా కరోనా టెస్టులు, వైద్యం అందించాలని నిర్ణయించింది. అందుకోసం మొదట మూడు ప్రైవేట్ మెడికల్ కాలేజీలను ఎంపికచేసింది. ఈ విషయమై సీఎం కేసీఆర్​ ఉన్నతాధికారులతో చర్చించినట్టు తెలిసింది. అయితే ఎంపికచేసిన వాటిలో మల్లారెడ్డి మెడికల్ కాలేజీ, మమత మెడికల్ కాలేజీ, కామినేని మెడికల్ కాలేజీలు ఉన్నాయి. మొదట కరోనా టెస్టులు, కరోనా వైద్యచికిత్సలు ఫ్రీగా అందజేస్తారు. ఆ తర్వాత ఈ సేవలను మరిన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు విస్తరించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.