![తెగిన బ్రిడ్జి.. నిలిచిన రవాణా](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/mnpd2.jpg?fit=677%2C402&ssl=1)
సారథి న్యూస్, మానవపాడు(జోగుళాంబ గద్వాల): జిల్లాలోని కేటీదొడ్డి మండలం నందిన్నె వద్ద ఉన్న మట్టిరోడ్డు బుధవారం కురిసిన భారీ వర్షాలకు తెగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొంతకాలంగా పాత వాగుపై కొత్త బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. బ్రిడ్జి పక్కన ఉన్న మట్టి రోడ్డు పైనుంచి వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వాగులో భారీగా నీళ్లు వచ్చి చేరడంతో ఈ వాగు తెగిపోయింది.
![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/mnpd.jpg?resize=640%2C374&ssl=1)