![తగ్గని మాయదారి రోగం](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/07/test-2f.jpg?fit=500%2C336&ssl=1)
సారథి న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో కరోనా తగ్గడం లేదు. రాష్ట్రంలో మంగళవారం 1,879 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా ఏడుగురు మృతిచెందారు. మొత్తం మృతుల సంఖ్య 313కు చేరింది. మొత్తంగా రాష్ట్రంలో 27,612 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి.
1,28,438 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. జిల్లాల వారీగా పరిశీలిస్తే జీహెచ్ఎంసీ పరిధిలో 1,422, రంగారెడ్డి జిల్లాలో 176 కేసులు, మేడ్చల్ జిల్లాలో 94, కరీంనగర్లో 32, నల్లగొండ 31, నిజామాబాద్లో 19 చొప్పున పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.