![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/09/RAJAKUMARIIIFF.jpg?fit=700%2C490&ssl=1)
సారథిన్యూస్, తెనాలి: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నన్నపనేని రాజకుమారి ఆదివారం ప్రమాదవశాత్తు తన ఇంట్లో జారిపడ్డారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబసభ్యులు వెంటనే తెనాలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలిపారు. మరోవైపు ఆమెకు ఆస్పత్రిలో ప్రస్తుతం పరీక్షలు చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, యువనేత లోకేశ్, ఇతర సీనియర్ నేతలు నన్నపనేని రాజకుమారి కుటుంబసభ్యులకు ఫోన్చేసి ఆరోగ్య వివరాల గురించి ఆరా తీశారు. మరోవైపు చంద్రబాబునాయుడు వైద్యులకు ఫోన్చేసి ఆమెకు మెరుగైన చికిత్స నందించాలని సూచించారు.