సారథిన్యూస్, వరంగల్ అర్బన్: వైద్యులతోపాటు జర్నలిస్టులు కూడా ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారని వరంగల్అర్బన్ జిల్లా డీఎంహెచ్వో లలిత దేవి పేర్కొన్నారు. పాత్రికేయులు కూడా తగిన జాగ్రత్తలు పాటిస్తూ తమ విధులను నిర్వర్తించాలని కోరారు. శనివారం వరంగల్ ప్రెస్క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కార్యక్రమంలో వరంగల్ ప్రెస్క్లబ్ అధ్యక్షుడు తుమ్మ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి పేరుమాండ్ల వెంకట్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు బీఆర్ లెనిన్, టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర నాయకుడు గాడిపల్లి మధు, జిల్లా కార్యదర్శి నాయకపు సుభాష్, వరంగల్ డిప్యూటీ డిఎంహెచ్ వో యాకూబ్ పాషా, అడిషనల్ డీఎంహెచ్వో మదన్ మోహన్ రావు, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, ప్రెస్ క్లబ్ బాధ్యులు సుధీర్ రంజిత్ దిలీప్ రమేశ్. సంజీవ్ సంపేట సుధాకర్ కట్ట రాజు, శ్రీకాంత్ , పొగాకు అశోక్, అమర్, బొడిగే శ్రీను, తిరుమల్ అంజి, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
- June 20, 2020
- Archive
- లోకల్ న్యూస్
- వరంగల్
- DMHO
- JOURNALIST
- PRESS CLUB
- WARANGAL
- జర్నలిస్టులు
- టీయూడబ్ల్యూజే
- Comments Off on జర్నలిస్టులకు కరోనా టెస్టులు