Breaking News

చంద్రశేఖర్​గౌడ్​కు సన్మానం

సారథిన్యూస్, చొప్పదండి: కరీంనగర్​ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్​ కమిటీ చైర్మన్​గా ఎన్నికైన అరెల్లి చంద్రశేఖర్​గౌడ్​ను మంగళవారం డీపీడీఎఫ్​( డెమొక్రటిక్​ ప్రైవేట్​ టీచర్స్​ యూనియన్​ ) ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. చంద్రశేఖర్​గౌడ్​ గతంలో డీపీడీఎఫ్​ గౌరవాధ్యక్షుడిగా పనిచేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ.. చంద్రశేఖర్​గౌడ్​ ఆధ్వర్యంలో వ్యవసాయమార్కెట్​ మరింత అభివృద్ధి చెందాలని వారు ఆకాంక్షించారు. కార్యక్రమంలో మార్కెట్​కమిటీ వైస్​ చైర్మన్​ కొత్తగంగారెడ్డి, డీపీడీఎఫ్​ నాయకులు మాచర్ల మహేశ్​, ఉపాధ్యక్షుడు గోవులకొండ అనిల్​, కోశాధికారి రమేశ్​, సభ్యులు మహేందర్​, కరీం, వరప్రసాద్​, శివ, శ్రీనివాస్​, రాంప్రసాద్​, కనకయ్య, మహేశ్​ తదితరులు పాల్గొన్నారు.