![](https://i0.wp.com/samajikasarathi.com/wp-content/uploads/2020/08/PRABHAS-NEW-PROJECT-HH.jpg?fit=700%2C394&ssl=1)
కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్నీల్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ సినిమా చేయనున్నట్టు టాక్. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా పూర్తయ్యాయని సమాచారం. యువతకు, మాస్ ఆడియన్స్ను ఆకట్టుకోవడంలో ప్రశాంత్ నీల్ దిట్ట. ఆయన తెరకెక్కించిన కేజీఎఫ్ చిత్రం సంచలన విజయం సాధించింది. మొత్తం భారతీయ సినిపరిశ్రమ అంతా ప్రశాంత్ నీల్ గురించే చర్చించుకుంది. అంతటి క్రేజ్ ఉన్న ప్రశాంత్ నీల్.. ప్రభాస్తో సినిమా తీస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అయితే ప్రశాంత్ నీల్ ప్రస్తుతం కేజీఎఫ్2 పనుల్లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ కూడా రాధేశ్యామ్తో పాటు మహానటి ఫేమ్ నాగ్అశ్విన్ దర్శకత్వంలో మరో సినిమాకు సైన్ చేశాడు. ఈ రెండు పూర్తయ్యాక ప్రశాంత్ నీల్ చిత్రం ప్రారంభించే అవకాశం ఉంది.