Breaking News

కరోనా వ్యాక్సిన్​ ధర రూ.225

కోవిడ్​ వ్యాక్సిన్​ ధర రూ. 225

పుణే: కరోనా వ్యాక్సిన్​ తయారీలో భారత్​కు చెందిన పలు ఫార్మా కంపెనీలు పురోగతి సాధిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పుణేలోని సీరం ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ ఇండియా కూడా కరోనా వ్యాక్సిన్​ తయారు చేస్తున్నది. సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్ ఇండియా కంపెనీ.. బిల్ అండ్​ మెలిండా గేట్స్ ఫౌండేషన్, అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి (జీఏవీఐ) భాగస్వామ్యంతో భారతదేశంతో సహా 92 దేశాలకు 100 మిలియన్ల డోసులను ఉత్పత్తి చేస్తున్నది. కాగా దీని ధర రూ. 225 గా నిర్ధారించినట్టు విశ్వసనీయ సమాచారం. కేంద్రప్రభుత్వం, రాష్ట్రాల భాగస్వామ్యంతో ఈ వ్యాక్సిన్​ డోసులను కొనుగోలు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయాలని యోచిస్తున్నది.