Breaking News

కరోనా కేసులు@ 20 లక్షలు

భారీగా పెరుగుతున్న కేసులు

ఢిల్లీ: మనదేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. గురువారం నాటికి కేసుల సంఖ్య 20 లక్షలకు చేరింది. గత 24 గంటల్లో 62,538 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటివరకు మొత్తం 20,27075 మందికి కరోనా సోకగా, 41,585 మంది ప్రాణాలు కోల్పోయారు. 6,07384 మందికి ఆస్పత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 13,78,106 మంది కోలుకున్నారు. ఒక్క రోజులో 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. ప్రస్తుతం కరోనా దేశంలో మరణాల రేటు 2. 07 శాతంగా నమోదైంది. ప్రస్తుతం దేశంలో రికవరీ రేటు 68 శాతానికి పెరిగింది. నిన్న ఒక్కరోజులో 57,4783 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది.